లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. బలమిచ్చిన సెంటిమెంట్

శుక్రవారం, 17 జులై 2020 (10:24 IST)
శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సూచీ 157 పాయింట్ల లాభంతో 36629 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 10786 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఐటీ, మీడియా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ఆర్థిక రంగ షేర్లు లాభపడుతున్నాయి.
 
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు నెలకొన్నప్పటికీ.., మార్కెట్లో నెలకొన్న బలమైన సెంటిమెంట్‌ సూచీలను లాభాల వైపు నడిపిస్తోంది. ఇకపోతే..  బ్రిటానియా, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటాస్టీల్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, కోటక్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, విప్రో షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.

అన్నీ చూడండి

ఔత్సాహిక నటీనటులను ఆహ్వానిస్తున్న రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను

Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్

తర్వాతి కథనం
Show comments