సంబంధిత వార్తలు
- 3 రోజుల సెలవు.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. కారణం అదే..?
- బ్లాక్ మండే.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అంతా లాక్ డౌన్ ఎఫెక్ట్
- స్టాక్ మార్కెట్ : ఒక్క నిమిషంలో రూ.13 లక్షల కోట్లు హాంఫట్...
- అధికంగా వర్తకం జరిపిన భారతీయ మార్కెట్లు, 107 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ
- తక్కువగా వాణిజ్యం జరిపిన బెంచిమార్కు సూచీలు, 345.51 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్.. 37వేల మార్క్ చేరువలో..?
బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. బ్యాంకింగ్, మెటల్, ఫార్మ రంగ షేర్ల లాభాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీ 366 పాయంట్లు ఎగసి సూచీల్లో 36960 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ కూడా 100 పాయింట్ల లాభంతో 10863 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ ట్రిపుల్ సెంచరీ లాభాలను మించి కొనసాగుతోంది. 37వేల మార్క్కు చేరువలో ఉంది.
ఇకపోతే.. హిందాల్కో, రిలయన్స్, వేదాంతా, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూస్టీల్, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్ర, బయోకాన్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, డా.రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ మాత్రం స్వల్పంగా నష్టపోతున్నాయి.
