గురువారం, 19 జూన్ 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By PNR
Last Updated : సోమవారం, 19 జనవరి 2015 (17:22 IST)

స్టాక్ మార్కెట్ : 140 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

బాంబే స్టాక్ మార్కెట్‌లో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ 140 పాయింట్ల మేరకు పెరిగింది. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 28,262 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 36 పాయింట్ల మేరకు వృద్ధిని నమోదు చేసుకుని 8550 వద్ద ఆగింది. 
 
దేశీయంగా రేపో రేటును తగ్గించడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం తదితర కారణాలతో పాటు ఎఫ్ఐఐలు, ఇటు దేశవాళీ ఫండ్ సంస్థల నుంచి పెట్టుబడులు తరలి రావడంతో ట్రేడింగ్ లాభాలను చవిచూసింది. బీఎస్‌ఈలో మిడ్ కాప్ 0.45 శాతం, స్మాల్ కాప్ 0.80 శాతం పెరిగాయి. 
 
ఇకపోతే... ఈ ట్రేడింగ్‌లో విప్రో, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, బీహెచ్ఈఎల్, టాటా మోటార్స్ తదితర కంపెనీలు లాభపడగా, హీరో మోటోకార్ప్, హిందూస్థాన్ యూనిలివర్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.