గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (13:39 IST)

నాన్న కారునే వినియోగిస్తా... సచిన్ ఇచ్చిన కారును నాన్నకు గిఫ్టుగా ఇస్తా : సాక్షి మాలిక్

రియో ఒలింపిక్స్ విజేత‌లు పివి సింధు, పుల్లెల గోపీచంద్, సాక్షి మాలిక్‌ల‌తో పాటు, దీపా క‌ర్మాక‌ర్‌ల‌కు క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండుల్క‌ర్ బిఎమ్‌డ‌బ్ల్యూ కార్ల‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి విదితమే. అయితే సా

రియో ఒలింపిక్స్ విజేత‌లు పివి సింధు, పుల్లెల గోపీచంద్, సాక్షి మాలిక్‌ల‌తో పాటు, దీపా క‌ర్మాక‌ర్‌ల‌కు క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండుల్క‌ర్ బిఎమ్‌డ‌బ్ల్యూ కార్ల‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి విదితమే. అయితే సాక్షి మాలిక్ స‌చిన్ ఇచ్చిన కారుని ఉపయోగించదట. ఆమె త‌న పాత కారునే వాడాల‌నుకుంటోంది. 
 
రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... గ్లాస్గోలో 2014లో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో వెండిప‌త‌కం సాధించిన‌పుడు త‌న తండ్రి త‌నకు బ్లూ రంగు వి డ‌బ్ల్యు పోలో కారుని కొనిచ్చార‌ని… తాను దాన్నే వాడుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
మ‌రి సచిన్ ఇచ్చిన బిఎండ‌బ్ల్యు కారుని ఏం చేస్తార‌ని అడిగితే… ఆ కారును నాన్నకు కానుకగా ఇచ్చేస్తానని సంతోషంగా చెప్పింది. తన తండ్రి తన కోసం ఎన్నో త్యాగాలు చేశారని, అందుకే సచిన్ చేతుల మీదుగా అందుకున్న కారుని ఆయనకే ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.