వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నా.. కడియం కావ్య
KCR_Kadiyam Kavya
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. భూ ఆక్రమణలు, అవినీతి, ఫోన్ ట్యాపింగ్, మద్యం కుంభకోణాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని అదే లేఖలో ఆమె ప్రస్తావించారు.
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కడియం కావ్య తన ఉపసంహరణ నిర్ణయాన్ని, అందుకు గల కారణాలను కూడా తెలియజేశారు. జిల్లాలో నేతల మధ్య సమన్వయం, సహకారం లేదని, దీంతో పార్టీ పరిస్థితి మరింత దెబ్బతింటుందని కడియం కావ్య అన్నారు.
ఈ చర్యపై కేసీఆర్, పార్టీ అధినాయకత్వం, బీఆర్ఎస్ క్యాడర్కు కావ్య క్షమాపణలు చెప్పారు. కావ్య నిర్ణయంపై కడియం శ్రీహరి, కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
