మంగళవారం, 4 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మార్చి 2025 (15:52 IST)

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

girl sacrifice
తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో మూఢనమ్మకాలు ఇంకా పోలేదు. గుప్త నిధుల కోసం, క్షుద్రపూజల కోసం చిన్నారులు, జంతువులను బలి ఇస్తున్న సంఘటనలు అపుడపుడూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బంగారు నిధుల కోసం 14 యేళ్ళ బాలికను నరబలి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరు మంత్రగాళ్లను అదుపులోకి తీసుకుని బాలికను ప్రాణాలతో రక్షించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు మంత్రగాళ్లను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
వాట్సాప్‌లో ముద్దు ఎమోజీ పంపించిన స్నేహితుడు.. అనుమానంతో ఇద్దరిని హత్య చేసిన భర్త! 
పొరుగింట్లో ఉన్న ఓ వివాహితకు ఓ స్నేహితుడు వాట్సాప్ ద్వారా ముద్దు ఎమోజీని పంపించాడు. ఇది తీవ్ర వివాదానికి దారితీయడంతో పాటు ఇద్దరి హత్యకు కారణమైంది. కేరళ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకున్న హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళ రాష్ట్రంలోని పథనంపట్టి జిల్లా కలంజూరుకు చెందిన బైజు, తన భార్య వైష్ణవి (28)తో కలిసి ఉంటుంన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి ఇంటి పక్కనే విష్ణు (30) అనే వ్యక్తి తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి వాట్సాప్ నంబరుకు విష్ణు ఒకసారి ముద్దు ఎమోజీని పంపించాడు. ఇది చూసిన బైజు తన భార్యతో గొడవకు దిగాడు. భర్తకు భయపడిన వైష్ణవి... పక్కనే ఉన్న తన స్నేహితుడు విష్ణు ఇంటిలోకి పారిపోయింది. ఇది బైజుకు మరింత ఆగ్రహం తెప్పించింది. 
 
కొడవలితో విష్ణు ఇంటికి చేరుకున్న బైజు... భార్యను పెరట్లోకి లాక్కెళ్ళి నరికాడు. దీన్ని ఆపేందుకు ప్రయత్నించి విష్ణుపై  కూడా దాడి చేశారు. ఈ దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత బైజు తన స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా, వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బైజును అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.