1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Traffic Chaos At Pendurthi As Devotees Flock For Giripradakshina

సింహాచలం ఆలయంలో గిరిప్రదక్షిణ.. ట్రాఫిక్‌తో భక్తులు ఇబ్బందులు

Simhachalam
అరుణాచలం గిరి ప్రదక్షణకు పెట్టింది పేరు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణ చేస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం గురు పూర్ణిమ కావడంతో సింహాచలం ఆలయంలో గిరిప్రదక్షిణ చేశారు. అలా గిరి ప్రదక్షణ పూర్తి చేసుకుని భక్తులు తమ ఇళ్లకు వెళ్లడం ప్రారంభించినప్పుడు పెందుర్తి మండలంలోని వేపగుంట ప్రధాన రహదారి వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 
 
వేపగుంట వద్ద నాలుగు వైపుల నుండి పెద్ద సంఖ్యలో భక్తుల వాహనాలు ప్రధాన రహదారిపైకి రావడంతో గందరగోళం ఏర్పడింది. వేడిగాలుల కారణంగా వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడ్డారు. 
 
ప్రజలు మూడు గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. తరువాత పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వారికి అవసరమైన ఉపశమనం లభించింది.
తర్వాతి కథనం
Pawan Kalyan: పవన్ కల్యాణ్ అన్నయ్య ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను.. నారా లోకేష్ (video)