రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 22 ఆగస్టు 2022 (14:40 IST)
తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీజేపీ అనుబంధ విద్యాసంస్థ అయిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం తెలంగాణాలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఏపీవీపీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇంటర్ విద్యా విధానంలో కార్పొరేట్ కాలేజీలను ప్రభుత్వం నియంత్రించడం లేదని ఆరోపించారు. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల ముందు ఏబీవీపీ ఆందోళన చేపడుతుందని తెలిపారు. 
 
ఇందులోభాగంగా, సోమవారం నారాయణగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ముందు ఏబీవీపీ నాయకులు ధర్నాలు చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై ఇంటర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ వైఖరిని ఖండిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు ఆయన వెల్లడించారు. 

అన్నీ చూడండి

Rishab Shetty :స్పైడర్-మ్యాన్ పాత్ర నాకు ఎంతో నేర్పింది : రిషబ్ శెట్టి

Ram Charan surgery :డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నేడు రామ్ చరణ్ కు మణికట్టు సర్జరీ

Nani: ఆయా షేర్ సాంగ్ క్రేజ్ తో రికార్డ్ స్థాయిలో బిజిసెస్ అయిన ది ప్యారడైజ్

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

తర్వాతి కథనం
Show comments