యూపీలో నేను చెప్పినట్టుగానే ఫలితాలు : సీఎం కేసీఆర్

సోమవారం, 21 మార్చి 2022 (19:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతాయని ముందుగానే తాను చెప్పానని ఆవిధంగానే ఫలితాలు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో 312 సీట్లు గెలిచిన బీజేపీ ఈ దఫా 255 సీట్లకే పరిమితమైందన్నారు. సీట్ల తగ్గుదల దేనికి సంకేతమే కమలనాథులు ఆలోచన చేసుకోవాలని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు సంబంధించిన ఒకే దేశం - ఒకే ధాన్య సేకరణ విధానం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్య సేకరణ విషయంలో గతంలో కూడా కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. దేశంలో ధాన్యానికి మాత్రమే కనీస మద్దతు ధర ఒక్క ధాన్యానికేనని బియ్యానికి కాదనే విషయాన్ని కేంద్రం గ్రహించాలని సీఎం కేసీఆర్ హితవు పలికారు.
 
పంజాబ్ రాష్ట్రంలో ఓ రీతిలో ధాన్యాన్ని సేకరిస్తున్నారో ఆ విధంగానే తెలంగాణాలో కూడా ధాన్యాన్ని సేకరించాలని కోరుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో పండబోయే యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

అన్నీ చూడండి

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

తర్వాతి కథనం
Show comments