మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన - నాలుగు జిల్లాల్లో సుడిగాలి టూర్

kcrao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వర్షాలకు పలు జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట మట్టిపాలైంది. దీంతో ఆయన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి వెళ్ళి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అలాగే, నష్టపోయిన రైతుల్లో మనోధైర్యం, భరోసా కల్పించేలా ఓదార్చుతారు. 
 
ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టుకు చేరుకునే సీఎం కేసీఆర్ ఆక్కడ నుంచి హెలికాఫ్టరులో ఖమ్మంకు చేరుకుంటారు. 11.15 గంటలకు జిల్లాలోని బొనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఉదయం 11.45 గంటలకు రామాపురం గ్రామం నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పాలమూరు జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. 
 
మధ్యాహ్నం 12.55 గంటలకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అడవి రంగాపురంగాపురం గ్రామం నుంచి 1.55 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రాపూర్‌లో దెబ్బతిన్న పంటలను ఆయన పరశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు లక్ష్మీపురం నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం ఆయా జిల్లాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.