1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:47 IST)

ప్రియుడిని అర్థరాత్రి ఇంటికి పిలిచిన మహిళ.. భర్త రాగానే ప్లేటు ఫిరాయించి హత్య

ఓ మహిళ, తన భర్తతో కలిసి ప్రియుడుని హత్య చేసింది. భర్త లేని సమయంలో ప్రియుడితో శారీరక సుఖం పొందేందుకు అర్థరాత్రి సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. బయటకెళ్లిన భర్త ఆ సమయంలో ఇంటికి తిరిగివచ్చాడు. అంతే.. ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన ఆ మహిళ.. ప్రియుడు తనపై అత్యాచారాం చేయబోయాడంటూ ఆరోపించింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి వ్యక్తిని చంపేసి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. 
 
ఈ దారుణం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొన్నేళ్లుగా కొనసాగిస్తుంది. అయితే, గత రాత్రి భర్త లేని సమయంలో నేహా, సోయల్‌ను ఇంటికి పిలిపించుకుంది. 
 
అదేసమయంలో భర్త ఇంటికి వచ్చాడు. భర్త మొయినుద్దీన్ భార్య నేహాను, ప్రియుడు సోయల్ గదిలో చూసి నిలదీయడంతో నేహా ప్లేట్ ఫిరాయించి, సోయల్ తనను బలవంతం చేయబోయాడని ఆరోపించింది. 
 
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ కలిసి సోయల్ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం నాచారం పోలీస్ స్టేషన్ లో లొంగి పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.