1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (17:55 IST)

రూ.251 కోట్లతో లిక్విడ్ వేస్ట్ ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్

ktramarao
హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్ఎంసీ జవహర్ నగర్ లోని డంప్ యార్డుకు తరలిస్తుంది. ఈ డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది.
 
భూగర్భ జలాలు, చెరువులు కలుషితం అవుతున్నాయి. దీంతో ప్రజల ఇబ్బందులను గుర్తించి పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి యంత్రాలు అందుబాటులో వుంచారు. 
 
ఇక నుంచి ద్రవ వ్యర్థాలను కూడా పూర్తిగా శుధ్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ సహకారంతో జీహెచ్ఎంసీ జవహర్ నగర్‌లో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్లతో నిర్మించిన ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. 
 
ఇప్పటివరకు 2వేల కిలోల లీటర్ల సామర్థ్యంతో పాక్షిక శుద్ధి సౌకర్యాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రోజుకు నాలుగు వేల కిలో లీటర్ల వరకు పెంచారు.