1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (18:09 IST)

జ్వరం - దగ్గుకు మాత్రలు కావాలంటే ఇకపై వివరాలు ఇవ్వాల్సిందే.. ఎక్కడ?

కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ వైరస్‌కు అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థతుల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. మెడికల్ షాపులు ఫీవర్ సర్వైలైన్స్‌లోకి భాగస్వామ్యం చేస్తూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటివాటికి మాత్రలు కొనుగోలు చేస్తే వారి వివరాలను సేకరించాలని మెడికల్‌ షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 
 
అయితే, ఈ వివరాలను సేకరించిన తర్వాత సర్కారు ఏం చేస్తుందన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ వివరాలు ద్వారా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడేవారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేసేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే.. మెడికల్ షాపుల్లో టాబ్లెట్స్ కొనేవారికి ఇది ఒకింత షాకింగ్ విషయమేనని చెప్పుకోవచ్చు.