Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏడుగురు మహిళల్ని..?

Written By ఎం
Updated: సోమవారం, 23 డిశెంబరు 2019 (08:21 IST)
ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. గతంలో అతను మరో ఏడుగురు మహిళలను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా గుర్తించారు.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 17వ తేదీ మంగళవారం డోకూర్‌ గ్రామ శివారులోని పంట పొలాల్లో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి హతమార్చినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అంతేకాదు,గతంలో జరిగిన ఏడు హత్యలతో అతనికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
 
డోకూర్‌లోని కల్లు కాంపౌండ్‌లో నిత్యం మద్యం సేవించే సదరు నిందితుడు..అక్కడ కల్లు తాగేందుకు వచ్చే మహిళలతో మాట కలిపేవాడు. ఆపై వారిని తనతో తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేసేవాడు. అలా అతని చేతిలో ఇప్పటివరకు ఏడుగురు మహిళలు బలయ్యారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు..
 
ఈ నేరాలన్నీ ఒక్కడే చేశాడా..? లేక అతనితో పాటు మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

అన్నీ చూడండి

Rashmika Mandanna: కోలుకున్న రష్మిక మందన్నా, మైసా చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన

అలా చేస్తే ప్రతి కథ ఒక బ్లాక్‌బస్టర్ అవుతుంది : దర్శకుడు శివ నిర్వాణ

చిరంజీవి గారి వల్లే డాన్సర్స్ సమస్యలకు పరిష్కారం: సుమలత

Karthi: ఏజెంట్ బోస్ గా కార్తీ నటించిన సర్దార్ 2 అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల

హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ హతః టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments