స్నేక్గ్యాంగ్ : దోషులకు జీవిత కారాగారశిక్ష విధించిన రంగారెడ్డి కోర్టు
స్నేక్ గ్యాంగ్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. 8 మంది దోషుల్లో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. అసభ్య ప్రవర్తన, దోపిడీ నేరాల కింద వీరికి శిక్షను కోర్టు ఖరారు చేసింది. అయితే స్నేక్ గ్యాంగ్పై ఒక్క అత్యాచార ఆరోపణను కూడా పోలీసులు నిరూపించలేకపోయారు.
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో 9 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ ముఠా 37 మంది యువతులను పాములతో బెదిరించి, లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి.
దోషులుగా తేలినవారిలో ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ, ఖాదర్ బర్కబా, తయాబ్ బస్లామా, మహ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం, అలీ బారక్బా ఉన్నారు. తొమ్మిదో నిందితుడు సలాం హమ్దీపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషిగా విడుదల చేశారు. స్నేక్ గ్యాంగ్ దోషులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.