1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 మార్చి 2022 (08:59 IST)

ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థులను ఆదుకోండి: ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులు ప్రత్యేక సెమిస్టర్లలో నిబంధనల సడలింపుతో సమానమైన సెమిస్టర్లలో ఇక్కడి వైద్య కళాశాలల్లో చేరేందుకు వీలు కల్పించి విద్యను పూర్తి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

 
ఉక్రెయిన్‌లో యుద్ధం తర్వాత విద్యార్థులు భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చిందని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చించి, పెద్ద మొత్తంలో డబ్బును వెచ్చించినప్పటికీ యుద్ధం కారణంగా వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు.

 
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన తెలంగాణకు చెందిన మెడికల్ విద్యార్థులందరి చదువుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని కేసీఆర్ ప్రకటించారు. కాగా వారు చదువుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించాలని కోరారు.