తెలంగాణలో పరువు హత్య.. ప్రేమించాడని దాడి.. యువకుడి మృతి

బుధవారం, 2 డిశెంబరు 2020 (21:50 IST)
తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌలు పూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తమ తరపు అమ్మాయిని ప్రేమించాడని ఆమె తరపు కుటుంబ సభ్యులు మహేష్ అనే వ్యక్తి పై దాడి చేశారు. దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 25 రోజుల క్రితం దాడి చేయగా హైదరాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
 
ఇరవై ఐదు రోజుల క్రితం దాడిచేయగా ప్రథమ చికిత్స చేయించారు. గత కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. రక్తం గడ్డకట్టడం వల్ల మరణించినట్లు వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
 
అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు దాడి చేయడం వల్ల మహేష్ కు రక్తం గడ్డ కట్టి మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అమ్మాయి తరపు బంధువులు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్నీ చూడండి

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

జీ5 కిడ్స్ లో యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ శివలోక్ కె కుండక్క మండక్క

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్. హైవాన్ లుక్

ప్రేమ, జ్ఞాపకాలతో తెరకెక్కిన సహ సినిమా చాలా నచ్చింది : కిరణ్ అబ్బవరం

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఫీల్ మై లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments