శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శనివారం, 13 జులై 2019 (18:03 IST)

మానవత్వంతో స్పందించడంలో ఈటెల రాజేందర్‌కు సాటి లేరు

మానవత్వంతో స్పందించడంలో ఈటెల రాజేందర్‌కు సాటి లేరు.. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. శనివారం నాడు జగిత్యాల వెళ్తున్న సందర్భంగా, గంగాధర- జగిత్యాల రోడ్డుపై బైకు- కారు ఢీకొనడంతో గాయపడిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
వారిని చూసిన మంత్రి వెంటనే స్పందించి, వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని జగిత్యాల సీఐ వాహనంలో గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటెల రాజేందర్‌తో పాటు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, నారదాసు లక్ష్మణ్రావు కూడా ఉన్నారు.