తెరాస ధూంధాం కార్యక్రమం.. దివ్యాంగుడిపై తెరాస నేత దాష్టీకం

మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:38 IST)
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో అధికార తెరాస ఆధ్వర్యంలో ధూంధాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు హాజరయ్యాడు. అయితే, ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న గెల్లు శ్రీనివాస్‌తో పాటూ ఎమ్మెల్యే హాజరయ్యారు. 
 
సభ చాలా సీరియస్‌గా జరుగుతుంటే... రాజేష్ అనే దివ్యాంగుడు తనకు పింఛన్ రావడం లేదని నాయకులను కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే అతన్ని పోలీసులు, స్థానిక నాయకులు అడ్డుకున్నారు. సభ ముగిసిన తర్వాత దివ్యాంగుడు.. స్టేజిపైకి ఎక్కి తనకు పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదంటూ మైకులో అడిగాడు. 
 
దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ మహేంద్రాచారి.. ఆగ్రహంతో ఊగిపోయి, స్టేజిపైకి ఎక్కి దివ్యాంగుడు రాజేష్‌ను కిందకు లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వారంతా ఆ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ ఇప్పించాల్సింది పోయి.. అడిగినవారిపై దాడి చేస్తారా.. అంటూ మండిపడ్డారు. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments