సంబంధిత వార్తలు
- భారతీయ యువతకు 10 లక్షల ఉద్యోగాలు: ప్రధానమంత్రికి రాసిన లేఖలో గరుడ ఏరోస్పేస్ అగ్నీశ్వర్ జయప్రకాష్ వాగ్దానం
- పాట పాడుతూ వేదికపై కుప్పకూలి ప్రాణాలు విడిచిన గాయకుడు
- మళ్లీ పెట్రో మంట : మరోమారు పెట్రోల్ - డీజల్ ధర పెంపు
- నిరుపేద బాలికలకు గగన విహారం - చెన్నై టు హైదరాబాద్ ఉచిత ప్రయాణం
- సింగీతం శ్రీనివాసరావుకు సతీవియోగం
ఐర్లాండ్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లి తెలంగాణ యువకుడు మృతి
ఫ్లోరిడాకు సమీపంలోని ఐర్లాండ్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడకు చెందిన కంటె మల్లయ్య కుమారుడు కంటె యశ్వంత్ (25) అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.
అయితే, ఆయన తన స్నేహితులతో కలిసి ఫ్లోరిడాకు సమీపంలోని ఐర్లాండ్ దీవులకు వివారయాత్రకు వెళ్లాడు. అక్కడ నుంచి ఓ ప్రైవేటు బోటు తీసుకుని పీటా దీవులకు వద్దకు చేరుకున్నాడు. అక్కడ సముద్ర స్నానం చేస్తుండగా ఒక్కసారిగా రాక్షస అలల తాకిడి గురై సముద్రంలోకి కొట్టుకునిపోయాడు. ఈ విషయాన్ని వేములవాడలోని కుటుంబ సభ్యులకు యశ్వంత్ స్నేహితులు చేరవేయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.