మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్గా కత్రినా కైఫ్
మాల్దీవుల మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC), బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ను మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. మంగళవారం సోషల్ మీడియా ద్వారా ఈ మేరకు ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి, ప్రధాన బ్రాండ్లకు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కత్రినా కైఫ్ తనను మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం పట్ల తన సంతోషాన్ని పంచుకుంది.
కత్రినా సోషల్ మీడియా ద్వారా... మాల్దీవులు లగ్జరీ, సహజ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అందం, ప్రశాంతతను కలబోసిన ప్రదేశం. సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్ అయిన మాల్దీవులకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక కావడం నాకు గౌరవంగా ఉంది. ఈ సహకారం ప్రపంచ ప్రేక్షకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను తీసుకురావడం గురించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అసాధారణ గమ్యస్థానం యొక్క ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రపంచ స్థాయిలో మాల్దీవుల ప్రాముఖ్యాన్ని ప్రచారం చేసేందుకు నేను ఉత్సాహంగా ఉన్నాను అంటూ పేర్కొంది.