1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (08:56 IST)

సినీ నటి మాధవీలతపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

ప్రముఖ సినీ నటి, బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలతపై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ కొందరు చేసిన ఫిర్యాదుతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
 
హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. 
 
మాధవీలత తన ఫేస్‌బుక్ ఖాతాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టు పెట్టారన్న ఫిర్యాదుతో ఆమెపై సెక్షన్ 295-ఎ కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్‌‌పై కూడా ఇలాంటి కేసే నమోదైన విషయం తెలిసిందే.