సోమవారం, 30 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (17:40 IST)

జాతీయ అవార్డుకు అర్హ‌త‌లున్న సినిమా కమిటీ కుర్రోళ్ళు: నాగ‌బాబు

Nagababu-kamiti kurrollu
Nagababu-kamiti kurrollu
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. ఈ మూవీ 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 50 డేస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి.
 
ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత‌ల్లో ఒక‌రైన ఫ‌ణి అడ‌పాక మాట్లాడుతూ, చాలా నేచుర‌ల్‌గా సినిమాను తెర‌కెక్కించిన య‌దు వంశీ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిహారిక‌గారికి క‌థ‌ల‌పై ఉన్న ప‌ట్టు, సినిమాటిక్ సెన్స్ గొప్ప‌గా ఉంటుంది అన్నారు. 
 
చిత్ర దర్శ‌కుడు య‌దు వంశీ మాట్లాడుతూ ‘‘ఈరోజుల్లో 50 రోజులు సినిమా పూర్తి చేసుకోవ‌టం అనేది అరుదుగా జ‌రుగుతుంటుంది. మా తొలి సినిమాకే ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదు. మంచి సినిమా చేస్తుంద‌నే న‌మ్మ‌కంతో అడుగులేశాం. నిహారిక‌గారు మా టాలెంట్‌ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు. నాగ‌బాబుగారుకి నెరేష‌న్ ఇచ్చిన త‌ర్వాత వెంట‌నే సినిమా ముందుకు క‌దిలింది. ఆయ‌న ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్క‌డ వ‌ర‌కు వ‌చ్చాం అన్నారు. 
 
చిత్ర స‌మ‌ర్ప‌కురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ,  ఈ క్ష‌ణాల‌ను ఎప్పటికీ మ‌ర‌చిపోలేం. ఓ మంచి సినిమాను తీస్తున్నామ‌ని అనుకున్నాం. కానీ, 50 డేస్ స‌క్సెస్‌ఫుల్ ర‌న్ ఉంటుంద‌ని అనుకోలేదు. మంచి సినిమాను ఆడియెన్స్ చాలా పెద్ద స‌క్సెస్ చేశారు. స్నేహాన్ని ఎంత స్వ‌చ్చంగా చూపించాల‌ని త‌నకు ఐడియా ఉండింది. త‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాను. దిల్‌రాజుగారు నాకు ఇన్‌స్పిరేష‌న్‌. ఆయ‌న‌లా డిఫ‌రెంట్ మూవీస్‌, క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ చేయాల‌నుకుంటున్నాను అన్నారు. 
 
దిల్‌రాజు మాట్లాడుతూ, రుద్రవీణ చిత్రానికి ప్రేక్ష‌కుడిని, గుడుంబా శంక‌ర్ చిత్రానికి డిస్ట్రిబ్యూట‌ర్‌ని. ఇప్పుడు ఆయ‌న కుమార్తె నిహారిక నిర్మించిన సినిమాకు ఆహ్వానం అందుకుని రావ‌టం ఆనందంగా ఉంది. ఈరోజు గేమ్ చేంజ‌ర్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంది. కొణిదెల ఫ్యామిలీకి, నాకు ఎక్క‌డో తెలియ‌ని బంధం ఏర్ప‌డింది. కొత్త సినిమాలు ఆడిన‌ప్పుడు నిర్మాత‌ల‌కు వ‌చ్చే కిక్కే వేరు.  సినిమా చూసిన‌ప్పుడు ఆడియెన్స్‌కు నిజ‌మైన జ్ఞాప‌కం దొరికింది. చిత్ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు కంగ్రాట్స్‌’’ అన్నారు. 
 
నాగ‌బాబు మాట్లాడుతూ, రెండున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధి ఉన్న ఈ మూవీలో చివ‌రి 70 నిమిషాల మూవీని చాలా గ్రిప్పింగా డైరెక్ట‌ర్ తీశాడు. నేను రాజ‌కీయాల్లో ఉన్నాను. అలాగే జ‌న‌సేన ప్ర‌స్థానం 2019 వ‌ర‌కు ఎలా ఉండింద‌నేది సినిమాను చూస్తుంటే గుర్తుకు వ‌చ్చింది. చాలా ఇంట్రెస్టింగ్‌గానూ అనిపించింది. సినిమాలో కొత్త‌గా న‌టించిన అబ్బాయిలు, అమ్మాయిలు అంద‌రూ చాలా చ‌క్క‌గా న‌టించారు. కామెడీ ట్రాక్‌, ల‌వ్ ట్రాక్ చాలా బాగా తీశారు. సినిమా చూస్తున్నంత‌సేపు మా చిన్న‌నాటి రోజులు గుర్తుకు వ‌చ్చాయి. సినిమాల‌నే కాదు, ఓటీటీల్లోనూ ఇప్పుడు ఎక్కువ‌గా అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి ఇలాంటి వారి అవ‌స‌రం ఇండ‌స్ట్రీకి చాలా అవ‌స‌రం. ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంది. నేష‌న‌ల్ అవార్డు సాధించ‌టానికి అన్నీ అర్హ‌త‌లున్న సినిమా ఇది. త‌ప్ప‌కుండా టీమ్ అందుకోసం ప్ర‌య‌త్నించాల‌ని కోరుకుంటున్నాను.  నిహారిక ఇలాంటి సినిమాను నిర్మించ‌టం నాకు చాలా గొప్ప‌గా అనిపిస్తుంది’’ అన్నారు.
 ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రికీ 50 డేస్ మెమొంటోని బ‌హూక‌రించారు.