1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:38 IST)

వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా.. శ్రీదేవి: వర్మ పోస్ట్ చేసిన లేఖలో?

దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటతడి పెట్టే ట్వీట్లు చేస్తూ

దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటతడి పెట్టే ట్వీట్లు చేస్తూ.. టీవికి అతుక్కుపోయాడు. శ్రీదేవి అంతిమ యాత్ర జరుగుతుంటే.. ఆమె నటించిన సినిమా పాటలను చూస్తుండిపోయాడు. టీవీ చూస్తూ దిగాలుగా నేలపై కూర్చుండిపోయాడు. 
 
ఇంకా ట్వీట్లతో శ్రీదేవికి నివాళులర్పించాడు. తాజాగా సినీ రచయిత లక్ష్మీ భూపాల రాసిన శ్రీదేవి వీడ్కోలు లేఖను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. బాల్యం నుంచే శ్రీదేవి అన్నింటినీ కోల్పోయిందని అందులో రాశారు. ఇంకా జీవితంలో శ్రీదేవి ఎదుర్కొన్న సమస్యలను ఆ లేఖలో పేర్కొన్నారు. ''వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా'' అంటూ శ్రీదేవి గురించి లక్ష్మీ భూపాల అందులో తెలిపారు. ఈ లేఖను మీరూ ఓ లుక్కేయండి..