గురువారం, 9 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : గురువారం, 9 అక్టోబరు 2025 (16:05 IST)

Saikumar: యాభై ఏళ్ల నట జీవితంలో అరి.. లో నటించడం గర్వంగా ఉంది - సాయికుమార్

Saikumar, Vinod Varma, Jayashankar and others
Saikumar, Vinod Varma, Jayashankar and others
అరిషడ్వర్గాల నేపథ్యంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మా దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించాడు. కథ విన్నప్పుడే ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ ను ఎంతోమంది పెద్దవాళ్లు ప్రశంసిస్తున్నారు. మూవీకి థియేటర్స్ లో మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నా అని నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల అన్నారు.
 
ఈ చిత్రానికి మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా ఘనంగా జరిగింది.
 
యాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ - జయశంకర్ అరిషడ్వర్గాల నేపథ్యంగా సినిమా అని చెప్పిప్పుడు కొత్తగా అనిపించింది. ఆరు పాత్రలతో జయశంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మా ఆరు పాత్రలు ఎక్కడా కలవవు. అందుకే మీతో పాటు నేను కూడా థియేటర్ లో ఈ సినిమా ఎలా వచ్చిందో చూడాలని అనుకుంటున్నా. నా 50 ఏళ్ల నట జీవితంలో అరి లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నా. ఈ సినిమాకు కనిపించే మూడు సింహాల్లాంటి ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు. కనిపించని నాలుగో సింహం లాంటి ప్రొడ్యూసర్ మా ఆర్వీ రెడ్డి గారు అమెరికాలో ఉంటారు. 
 
ఈ మధ్య గంగాధర శాస్త్రి గారి భగవద్గీతకు వచనం చెప్పాను. జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ప్రాజెక్ట్ కు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 108 శ్లోకాలకు తెలుగు వెర్షన్ చెప్పాను. అలాగే జీఎంఆర్ వాళ్లు భగవద్గీతను తెలుగులోకి తీసుకొస్తూ నన్నే వాయిస్ చెప్పమన్నారు. అలా ఈ మధ్య నాపై శ్రీకృష్ణుడు దయ చూపిస్తున్నాడు. మనం ఆధునికంగా ఎంత ఎదిగినా మన నాగరికత మర్చిపోకూడదు. ఒక మంచి సందేశాన్ని సినిమా అనే పవర్ ఫుల్ మీడియా ద్వారా చెబుతున్నాం. పెద్దలంతా మా మూవీని ఆశీర్వదించారు. వెంకయ్య నాయుడు గారు మోడరన్ భగవద్గీత అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
యాక్టర్ వినోద్ వర్మ మాట్లాడుతూ -  మూడు పేజీల డైలాగ్స్ కూడా చెప్పాను. సాయి కుమార్ లాంటి యాక్టర్ తో వర్క్ చేసినప్పుడు మాత్రం భయమేసింది. మనలోని భావోద్వేగాలను నియంత్రించుకోవాలనే మంచి కాన్సెప్ట్ ను ఎంటర్ టైనింగ్ రూపొందించాడు జయశంకర్. మంచి కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘అరి’ సినిమాను కూడా మీరు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం. అన్నారు.
 
నిర్మాత శ్రీనివాస్ రామిరెడ్డి మాట్లాడుతూ - మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే పాయింట్ తో దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించారు. మాకు సింగిల్ లైన్ లో ఆయన చెప్పిన కథ నచ్చి ఈ మూవీని నిర్మించాం. మనలోనే అరిషడ్వర్గాలు అనే శత్రువులు ఉంటాయి. వాటిని జయించినప్పుడే గొప్ప స్థాయికి వెళ్తాం. ‘అరి’ సినిమా నిర్మాణంలో భాగమైన నా తోటి నిర్మాతలకు థ్యాంక్స్. మా మూవీని తెలుగు ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటి అనసూయ మాట్లాడుతూ - ‘అరి’ సినిమాకు వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఆంథాలజీ తరహాలో సాగే చిత్రమిది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద చూడాలి. మంచి సందేశం, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ‘అరి’ చిత్రాన్ని మీరు చూసి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - డైరెక్టర్ జయశంకర్ ‘అరి’ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేశాం. ఈ మూవీలో ఆరుగురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. వారిలో సాయి కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది. ‘అరి’ లాంటి మూవీ చేయడం సులువు కాదు. నిర్మాతలకు నా అభినందనలు చెబుతున్నా. మనలోని వీక్ నెస్ లను ఓవర్ కమ్ చేయాలని చెప్పే మంచి చిత్రమిది. ఈ సినిమాను ప్రేక్షకులు మిస్ కాకూడదు అని కోరుకుంటున్నా. అన్నారు.
 
డైరెక్టర్ జయశంకర్ మాట్లాడుతూ -  ఎంతోమంది సద్గురులను కలిసి ఒక ఎంటర్ టైనింగ్ గా ఈ చిత్రంలో రూపొందించాను. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక, ఆ పాత్ర నేనే కదా అనే ఫీల్ కలుగుతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. మా ప్రొడ్యూసర్ ఆర్వీ రెడ్డి గారు లేకుంటే అరి సినిమా లేదు. మా చిత్రంలోని ఆరు పాత్రల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది సాయికుమార్ గారిని. ఆయన పర్ ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. అలాగే నా స్నేహితుడు వినోద్ వర్మకు ఈ చిత్రంతో మంచి పేరొస్తుంది. అన్నారు.
 
ఇంకా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి,  తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి, మినిస్టర్ జి. వివేక్, ప్రసన్నకుమార్, దామోదరప్రసాద్ తదిరులు మాట్లాడారు.