పుకార్లంటే నాకు వికారం.. అంత నీచంగా ఎలా రాస్తారు : 'లోఫర్' హీరోయిన్ దిశా పటానీ
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం 'లోఫర్'. ఈ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన భామ దిశా పటానీ. ఈ చిత్రం తర్వాత తన దృష్టంతా బాలీవుడ్ మీదే కేంద్రీకరించింది. ఆమె శ్రమ వృధా కాలేదు. అలాగే, హాలీవుడ్ మూవీలో నటిం
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం 'లోఫర్'. ఈ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన భామ దిశా పటానీ. ఈ చిత్రం తర్వాత తన దృష్టంతా బాలీవుడ్ మీదే కేంద్రీకరించింది. ఆమె శ్రమ వృధా కాలేదు. అలాగే, హాలీవుడ్ మూవీలో నటించాలన్న కోరిక ప్రతి బాలీవుడ్ హీరోయిన్కూ ఉంటుంది. అలాంటివారిలో దిశా పటానీ కూడా ఒకరు. కొన్ని సంవత్సరాల తర్వాత కానీ వారి కల నెరవేరదు. కానీ దిశా పటాని మాత్రం చాలా తక్కువ కాలంలోనే హాలీవుడ్ మూవీలో అవకాశాన్ని దక్కించుకుంది. పైకి సౌమ్యంగా కనిపించినా, తనకు సిగ్గు, స్వార్థం, అన్నిటికి మించీ అదృష్టం ఎక్కువ అంటోంది.
అంతేకాకుండా, నా విషయాలేవీ బయటకు తెలీకుండా ఎంత జాగ్రత్త పడినా నా మీద పుకార్లు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదని వాపోయింది. ఒక్కోసారి వాటిని చదువుతుంటే వికారంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలా నీచంగా రాస్తుంటారు. ఏమీ లేకుండానే ఒక వ్యక్తి మీద అలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో వారికే తెలియాలి. మొదట్లో వీటిని ఖండించేదాన్ని. కానీ అవి ఆగేటట్టు కనిపించలేదు. అందుకే ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశాను అని దిశా పటాని చెప్పుకొచ్చింది.