బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (14:40 IST)

అల్లు అర్జున్ ఆ వేడుక‌కు వ‌స్తున్నాడా!

Allu Arjun still
కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న సినిమా 'చావు క‌బురు చ‌ల్ల‌గాస‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బన్నీ వాసు నిర్మించారు. కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ టీజ‌ర్ విడుద‌లైన త‌ర్వాత కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మార్చి 9న జ‌ర‌గ‌బోతున్న చావు క‌బురు చ‌ల్ల‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత బ‌న్నీవాసు ప్ర‌క‌టించారు.

అభిమానుల్ని ప్రొత్స‌హించ‌డంలో ఎల్ల‌ప్పుడూ ముందుండే స్టైలిష్ట్ స్టార్ అల్లుఅర్జున్ ప్ర‌స్తుతం పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ చావు క‌బ‌రు చ‌ల్ల‌గా టీమ్ కోసం త‌న‌ స‌మ‌యాన్ని ఇచ్చి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా రావ‌డానికి అంగీక‌రించి‌నందుకు చాలా ఆనందంగా ఉన్న‌ట్లుగా చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. మార్చి9న హైద‌రాబాద్ జేఆర్సి ఫంక్ష‌న్ హ‌ల్ లో భారీ స్థాయిలో ఈవెంట్ ను నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని అన్నారు నిర్మాత బ‌న్నీవాసు. ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 19న విడుద‌ల అవ్వ‌నుంది. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.