బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (10:13 IST)

పెళ్లికి ముందే సర్వస్వం ప్రియుడికి అప్పగింత.. పెళ్లి తర్వాత షూటింగుల్లో బిజీ!

టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ ఇంటికి కోడలైంది. తన ప్రియుడు, ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతం కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఈ వివాహం గత నెల 30వ తేదీన జరిగింది. అయితే, ఈ వివాహం తర్వాత ఈ అమ్మడు ఎలాంటి హనీమూన్ ట్రిప్‌కు ప్లాన్ చేయలేదు. దీనికి కారణం కరోనా వైరస్ మహమ్మారి అని చెబుతున్నప్పటికీ.. మరో కారణం ఉంది. 
 
కాజల్ అగర్వాల్, గౌతం కిచ్లూలు గత ఏడేళ్ళుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు. మూడేళ్ళపాటు డేటింగ్‌లో ఉన్నారు. అంటే పెళ్లికి ముందే కాజల్ అగర్వాల్ తన ప్రియుడికి సర్వస్వం సమర్పించుకుంది. అందుకే ఈ అమ్మడు పెళ్లి తర్వాత కరోనా సాకు చూపించి ఎలాంటి హనీమూన్‌కు ప్లాన్ చేసుకోలేదు. 
 
కానీ, ఈ అమ్మడు చెబుతున్నది మాత్రం మరోలావుంది. పెళ్లి తర్వాత కాస్త విరామాన్ని తీసుకోవాలని భావించినప్పటికీ.. ముందస్తు సినిమా కమిట్‌మెంట్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని కాజల్‌ అగర్వాల్‌ నిర్ణయించుకుందట. 
 
ఆమె కథానాయికగా తమిళంలో 'హే సినామికా' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్నాడు. సినిమా చిత్రీకరణను ఇటీవలే పునఃప్రారంభించారు. పదో తేదీన కాజల్‌ అగర్వాల్‌ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నదని చిత్ర బృందం ప్రకటించింది. 
 
పెళ్లి తాలూకు హంగామా నుంచి ఇంకా తేరుకోకముందే వృత్తిపట్ల తన కమిట్‌మెంట్‌ను తెలియజేసేలా కాజల్‌ అగర్వాల్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నదని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.