ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (14:47 IST)

టాలీవుడ్‌లో తొలి నంది అవార్డు అందుకున్న రెబెల్ స్టార్

chiru - krishnamraju
తెలుగు చిత్రపరిశ్రమలో తొలి నంది అవార్డును అందుకున్న నటుడుగా రెబెల్ స్టార్ కృష్ణంరాజు రికార్డు సాధించారు. ఆయన 56 యేళ్ళ సుధీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలను ఆయన సొంతం చేసుకున్నారు. 1966లో "చిలకా గోరింక" అనే చిత్రం ద్వారా వెండితెర హీరోగా పరిచయమైన కృష్ణంరాజు ఆదివారం వేకువజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. 
 
పోస్ట్ కోవిడ్‌తో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం వేకువజామున కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఓక వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు విలన్ క్యారెక్టర్లను కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. 
 
దాదాపు 200కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. తన 56 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో ప్రత్యేకతలను, ఘనతలను సొంతం చేసుకున్నారు. తెలుగులో మొట్టమొదటి నంది అవార్డును అందుకున్న ఘనత కూడా ఆయనదే. మరోవైపు ఆయన మృతి వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురవుతోంది.
mahesh - krishnamraju
 
మరోవైపు, కృష్ణంరాజు మృతిపట్ల సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. కృష్ణంరాజు మృతి పట్ల టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రెబల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని.. ఆయన మరణం టాలీవుడ్‌కు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతున్నానని చెప్పారు. 
 
అలాగే, కృష్ణంరాజు మృతి పట్ల వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కృష్ణంరాజు మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఒక మంచి స్నేహితుడిని, సన్నిహితుడిని కోల్పోయానని అన్నారు. కృష్ణంరాజుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.