శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (14:18 IST)

ఫ్యామిలీతో యాడ్ చేసిన మహేష్ బాబు.. వీడియో వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్‌లో నటించారు. తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా ఓ యాడ్‌లో నటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరం కలిసి తొలిసారిగా నటించామని చెప్పుకొచ్చారు. 

ఈ యాడ్ షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని తెలిపాడు. అంతేగాకుండా యాడ్ లింకును కూడా పోస్టు చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్‌ను నిర్మించిందని, అందుకు కృతజ్ఞతలని చెప్పాడు.
 
‘మీ ప్రేమతో మీరు నన్ను సూపర్ స్టార్‌ని చేశారు.. కానీ, నేను కూడా మీలో ఒకణ్ణి.. మీ అందరిలాగే నాక్కూడా నా ఫ్యామిలీనే నా లైఫ్ లైన్.. నా ఇల్లే నా ప్రపంచం.. నా వాళ్లనుకునే మీ అందరికీ నేనిచ్చే సలహా.. ఫర్ ట్రస్ట్ అండ్ వాల్యూ.. సాయిసూర్య డెవలపర్స్’.. అంటూ మహేష్ ఫ్యామిలీతో కలిసి నటించిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే.. మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ''సరిలేరు నీకెవ్వరు''  సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల కానుంది.