1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 మే 2024 (10:33 IST)

పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదంటున్న భర్త, మరేంటి?

pavitra jayaram
త్రినయని. ఈ సీరియల్ చూసేవారికి పవిత్రా జయరామ్ పరిచయం అక్కర్లేదు. కన్నడ, తెలుగు సీరియళ్లలో పాపులర్ నటిగా పేరుగాంచిన పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని ఆమె భర్త చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆమె అభిమానులు షాక్ తింటున్నారు.
 
అసలు ఆరోజు ఏం జరిగిందంటే... ఆమె ప్రయాణిస్తున్న కారు.. 44వ జాతీయ రహదారిపై భూత్‌పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను గుద్ది.. ఆ తర్వాత ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ కారులో ప్రయాణిస్తూ వచ్చిన పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్‌లు గాయపడ్డారు. వీరిలో పవిత్ర మృతి చెందారు. మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఐతే ఆ ప్రమాదంలో పవిత్రకు గాయాలేమీ కాలేదట. కానీ చంద్రకాంత్ కు తీవ్రగాయాలై రక్తం కారుతూ వుండటాన్ని చూసి షాక్ తిన్నదట. ఆ షాక్ లోనే ఆమెకి గుండెపోటు వచ్చిందట. తను చూస్తుండగానే తన కళ్లెదుటే గుండెపోటుతో మరణించిందని భర్త చంద్రకాంత్ ఆవేదనతో చెప్పారు.