శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (09:02 IST)

లాక్‌డౌన్‌లో 'పాయల్' బిజీబిజీ... ఫ్యాన్లు తుడుస్తూ ఫోజులు

తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన కొత్తకారు హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. "ఆర్ఎక్స్100" అనే చిత్రం ద్వారా ఈ భామ తెలుగు వెండితెరపై కనిపించింది. ఈ చిత్రంలో అందాలు ఆరబోస్తూ.. నెగెటివ్ హీరోయిన్ పాత్రలో అద్భుతంగా నటించింది. దీంతో ఒక్క సినిమాతోనే ఆమె మంచి పాపులర్ అయిపోయింది. 
 
అయితే, కరోనా వైరస్‌ మహమ్మారితో పాటు లాక్‌డౌన్ కారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో ఇంటి పనులు, వంట పనులు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా 'ఆర్‌ఎక్స్ 100' భామ పాయల్ కూడా ఇదే పని చేసింది. ఇంటిపనుల్లో బిజీగా ఉన్న పాయల్ పాప ఏం చేస్తుందో తెలుసా?
 
తన ఇంటిలోని ఫ్యాన్‌ను తనే స్వయంగా శుభ్రం చేసుకుంది. టేబుల్‌పైకి ఎక్కి.. ఒక చేత్తో ఫ్యాన్ పట్టుకుని మరో చేత్తో ఫ్యాన్ రెక్కలను క్లాత్‌తో శుభ్రపరుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంటిలో తను చేస్తున్న ఈ పనిని తన ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా షేర్ చేసిన పాయల్ ఇంటి పనులలో నిమగ్నమయ్యానంటూ తెలిపింది. అలాగే, ప్రతి ఒక్కరూ ఈ లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ టైమ్ పాస్ చేయాలని సలహా ఇచ్చింది.