1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (09:45 IST)

దర్శకుడు సాయి రాజేష్‌కి గిఫ్టుగా ఇచ్చిన నిర్మాతలు

car gift
ఇటీవలే 68వ జాతీయ సినిమా అవార్డులలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో ‘కలర్ ఫోటో’ చిత్రానికిగాను జాతీయ అవార్డు అందుకున్నారు కథ రచయిత, దర్శకుడు సాయి రాజేష్. 2020 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం సాయి రాజేష్ "బేబీ" అనే తెరకెక్కిస్తున్నారు.   
 
యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కే.ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 
న్యూ ఏజ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది. 
 
ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన పోస్టర్స్ "బేబి" అంచనాలను పెంచాయి. త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ మరియు టీజర్ రిలీజ్ కానుంది. ఆ తరువాత అధికారికంగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నారు.  
 
"బేబీ" చిత్రం రష్ చూసిన నిర్మాతలు ఎస్.కే.ఎన్, మారుతిలు దర్శకుడు సాయి రాజేష్‌కు ఎం.జి.హెక్టార్ కారును బహుమతిగా అందించారు. చెప్పిన కథను అలానే అద్భుతంగా తెరకెక్కించినందుకుగాను ఆనందంతో ఈ బహుమతిని అందించారు. 
 
మాములుగా సినిమా రిలీజై విజయవంతం అయిన తర్వాత గిఫ్టులు ఇస్తుంటారు. కానీ రిలీజ్‌కు ముందుగానే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా గిఫ్ట్ ఇవ్వడం అనేది అరుదుగా జరుగుతుంది. 
 
ఏదేమైనా ఈ సినిమాపై నిర్మాత ఎస్ కె ఎన్ మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ రోజుల్లో, టాక్సీవాలా, మంచి రోజులొచ్చాయి లాంటి చిత్రాలతో హిట్ అందుకున్న ఎస్.కె.ఎన్ ఈ సారి "బేబీ" చిత్రంతో కూడా హిట్ అందుకోనున్నారు.