Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధు ప్రీతిపై ఒరేయ్‌ బుజ్జిగా ఏమన్నాడంటే..?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (16:50 IST)
rajtarun
యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ బంధు ప్రీతి గురించి తాజాగా స్పందించారు. బయట నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వ్యక్తిని అయినప్పటికీ బంధుప్రీతి కారణంగా ఇప్పటివరకూ తాను ఎలాంటి ఆఫర్స్‌ కోల్పోలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కొంచెం ఎక్కువగా కష్టపడాలని మాత్రం తనకు అర్థమైంది. 
 
తెలుగు సినీ పరిశ్రమ టాలెంట్‌కు పెద్దపీట వేస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కాబట్టి టాలెంట్‌ ఉంటే తప్పకుండా ఎవరైనా ఇక్కడ రాణించగలరని రాజ్‌ తరుణ్‌ తెలిపారు. కథానాయకుడిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టకముందు నుంచే దర్శకుడిగా రాణించాలనే కల ఉండేది. కథలు రాయడమంటే తనకెంతో ఇష్టం. అలా రాసిన ప్రతిసారీ తప్పకుండా ఓ రోజు ఆ కథలతో సినిమా చేయాలనుకునేవాడిని అని తెలిపాడు. 
 
కానీ ప్రస్తుతానికి తన దృష్టంతా నటన మీదే ఉంది. 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్‌ కుమార్‌ కొండా టాలెంట్‌ ఉన్న వ్యక్తి. ఆయనతో తనకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తామిద్దరం కలిసి మరో సినిమా కోసం పనిచేస్తున్నాం. ప్రస్తుతం దాని షూటింగ్‌ జరుగుతోంది. మరోవైపు ఓ నూతన దర్శకుడితో కలిసి పనిచేస్తున్నాను. లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో కథలు విన్నాను. వాటిల్లో చాలా కథలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయి. ఫైనల్‌ కాగానే ప్రకటిస్తానని తెలిపాడు. 
 
కాగా, తాజాగా విడుదలైన 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రంలో రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటించారు. మాళవికా నాయర్‌ కథానాయిక. హెబ్బా పటేల్‌ కీలకపాత్ర పోషించారు. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాధామోహన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా 'ఆహా' వేదికగా అక్టోబర్‌ 1న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?

సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్‌

తర్వాతి కథనం
Show comments