వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్!
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలను లైనులో పెట్టారు. ప్రస్తుతం ఆయన "విశ్వంభర" చిత్రంలో ఆయన బీజీగా నటిస్తున్నారు. మరోవైపు, "దసరా" మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఒకపుడు తన అందచందాలతో బాలీవుడ్ను ఊపేసిన రాణీ ముఖర్జీ ఈ సినిమాలో నటిస్తున్న సమాచారం.
ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి నరసన నటించే హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని శ్రీకాంత్ ఓదెల సూచన చేయగా మెగాస్టార్ చిరంజీవి సైతం సమ్మతం తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్లో సైతం ట్రెండ్ అవుతుంది.