బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం కాస్త బలహీనపడింది. నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలపడిన పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది.
ఈ క్రమంలో ఏపీలో గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా తొట్టంబేడులో 47.2 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 37.5 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా మన్నారపోలులో 32.7 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా నిండ్రలో 30 మిల్లీమీటర్ల వర్షవాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది.