మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (18:05 IST)

నితిన్ భుజానికి గాయం.. బెంగపెట్టుకున్న రష్మిక

హీరో నితిన్ భుజానికి గాయమైంది. దీంతో కన్నడ భామ రష్మిక మందన్నా బెంగపెట్టుకుంది. నితిన్‌ భుజానికి గాయమైన సంగతి తమకు తెలియదంటూ ఆందోళన చెందుతోంది. ఇంతకు రష్మిక అంతగా ఎందుకు ఆందోళన చెందుతుందోనని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చసాగుతోంది. 
 
'ఛలో' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వెంకీ కుడుముల. హీరో నితిన్, రష్మిక జంటగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు వెంకీ కుడుముల ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి "భీష్మ" అనే టైటిల్‌ను రిజిస్టర్ చేశారు. 'లై', 'ఛల్ మోహన‌రంగ', 'శ్రీనివాసకళ్యాణం' వంటి వరుస ప్లాప్‌ల తర్వాత వెంకీతో చేయబోయే సినిమాపై నితిన్ గంపెడాశలు పెట్టుకున్నారు. 
 
ఈ చిత్రం షూటింగ్ డిసెంబరు నెలలోనే ప్రారంభంకావాల్సివుంది. కానీ, అది ప్రారంభంకాలేదు. పైగా, ఈ చిత్ర షూటింగ్ ఎపుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా తెలియదు. ఫలితంగా ఈ చిత్రంపై టాలీవుడ్‌లో పలురకాలుగా చర్చసాగుతోంది. 
 
దీంతో డైరెక్టర్ వెంకీ పెదవి విప్పారు. నితిన్‌ భుజానికి గాయమైందని, అతను ఇపుడిపుడే కోలుకుంటున్నారని, వ్యాయామాలు వంటివి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పైగా, రష్మిక ఎప్పటిలానే తన షూటింగ్‌లతో బిజీగా ఉందని, స్క్రిప్టు ఫైనల్ అవుతోందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న రష్మిక... అయ్యో నితిన్‌కు గాయమైందా. నాకు తెలియదే అంటూ కంగారుపడుతూ అడిగింది. దీనికి నితిన్ కూడా రిప్లై ఇచ్చాడు. "హేయ్ రష్మిక.. నేనిప్పుడు బాగానే ఉన్నా. షూటింగ్‌లో కలుద్దామంటూ చెప్పాడు. పనిలోపనిగా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెంకీ అడగాడు కూడా.