శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 10 మార్చి 2019 (12:43 IST)

వరుస ఆఫర్లు జోరులో పాయల్ రాజ్‌పుత్

'ఆర్ఎక్స్ 100' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో తన నెగెటివ్ రోల్ ద్వారా ప్రతి ఒక్కరి దృష్టిని ఆమె ఆకర్షించింది. తొలి చిత్రంతోనే మంచి హిట్ కొట్టిన ఈ అమ్మ‌డి చేతిలో ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. త‌మిళంలో ఓ సినిమా చేస్తున్న పాయ‌ల్ తెలుగులో 'డిస్కోరాజా' అనే చిత్రంలో ర‌వితేజ‌తో జ‌త‌క‌ట్ట‌నుంది. 
 
ఇక వెంకీ, చైతూ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న మ‌ల్టీ స్టార‌ర్ మూవీలోను పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌గా ఎంపికైంది. ఈ చిత్ర తొలి షెడ్యూల్ రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతుండగా, తుది ద‌శ‌కు చేరుకుంది. రెండో షెడ్యూల్ ఏప్రిల్‌లో మొద‌లు పెడ‌తార‌ని టాక్‌.
 
బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నా మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే వెంకీతో జ‌త‌క‌ట్ట‌నున్న పాయ‌ల్ 'వెంకీ మామ' చిత్ర సెట్స్‌లో అడుగుపెట్టేందుకు చాలా ఆతృత‌గా ఎదురు చూస్తున్న‌ట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. 
 
కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్లర్ ఓనర్‌గా నటిస్తుండగా చైతూ మిలిటరీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. చైతూకి జోడిగా రాశిఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సీజన్‌లో విడుదలకానుంది.