శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (13:38 IST)

#SarkaruVaariPaataతో ఆ రికార్డ్ బ్రేక్.. చిరును బీట్ చేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'సర్కారు వారి పాట' పేరుతో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆడియో రైట్స్‌ను సరిగమ సౌత్ దక్కించుకుంది. అయితే ఈ ఆడియో రైట్స్ కోసం సరిగమ సౌత్ నాలుగున్నర కోట్లు చెల్లించుకుందట. 
 
ఇదే ఇప్పటి వరకు మన టాలీవుడ్లో ఒక నాన్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్‌లో అత్యధికం అన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే థమన్ ఇస్తున్న ఆల్బమ్‌పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఆల్బమ్ ఎలా ఉండనుందో చూడాలి. 
 
ఇక్కడ మరో విషయం ఏమంటే ఇప్పటి వరకు చిరంజీవి ఆచార్య ఆడియో రైట్స్‌ రికార్డ్ రేటుకు అమ్మడుపోయాయి. ఆచార్య ఆడియో రైట్స్ నాలుగు కోట్లకు అమ్మడుపోగా.. ఆ రికార్డ్‌ను మహేష్ బాబు సర్కారు వారి పాట బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది.
 
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. 
 
మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.