'రోజా' చేస్తున్న టబు...
ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తుంటారు. అందులో మహిళలు, పురుషులు భేదం లేదు. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీన్ని పాటిస్తారు. రాత్రికి దీక్ష విరమిస్తారు. ఇలా చేయడాన్ని రోజా అంటారు. బాలీవుడ్లో నటీనటులు ఆచరిస్తుంటారు. అందులో టబూ కూడా ఒకరు.
అయితే దీక్షలో ఉండగానే షూటింగ్లో పాల్గొంటున్నా.. అందుకు కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. అలా టబు ఆచరిస్తోంది. తాజాగా ఆమె హిందీ 'దృశ్యం'లో నటిస్తోంది. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటుంది. పోలీసు అధికారిణిగా ఆమె ఇందులో నటించింది. జులై నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.