సంబంధిత వార్తలు
- అల్లు అర్జున్పై కేసు నమోదు.. కారణం ఏంటో తెలుసా?
- సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? ఆయనంతే 'పుష్ప' కదా?
- నంద్యాలలో వై.సి.పి. అభ్యర్థి రవి చంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రచారం
- వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాలలో పుష్ప.. స్నేహితుడికి ఓటు వేయాలని..
- పవన్కల్యాణ్కు మద్దతు ప్రకటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్కు మద్దతు
టాలీవుడ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నంద్యాలలో తన స్నేహితుడికి మద్దతు తెలపడంపై విలేకరులు ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ మాట్లాడుతూ... రవిచంద్ర తనకు గత 15 ఏళ్లుగా మిత్రుడన్నారు. రాజకీయాల్లోకి వస్తే మద్దతు తెలుపుతానని మాటిచ్చాను. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు విషెస్ తెలిపి వచ్చాను. అలాగే నా సపోర్ట్ మావయ్య పవన్ కల్యాణ్ గారికి కూడా వుంటుంది. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు అని అన్నారు.
#AlluArjun to the media today
— Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) May 13, 2024
I am not affiliated with any political party, my uncle Pawan Kalyan will always have my support.
Also to my friend Ravichandra.. to my other uncle Chandrasekhara Reddy. I support my friends and family in politics irrespective of the parties. I'M… pic.twitter.com/VCBqPlXFTI
తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్, బారులు తీరిన యూత్
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రక్రియలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆరు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూలైన్లో ఉన్నవారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లువుండగా.. ఇందులో పురుషులు 2,03,39,851 మంది, మహిళలు 2,10,58,615 మంది, ఇతరులు 3,421 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి 12,438. వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలు 34,651 (74.70 శాతం).
మరోవైపు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. ఈ దఫా మారుమూల తండాలు, గిరిజన గూడేల్లోనూ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. సుమారు 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
అదేవిధంగా దేశంలో నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఉత్తర్ప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, బెంగాల్లలో 8 చొప్పున, బిహార్లో 5, ఒడిశా, జార్ఖండ్లో 4 చొప్పున, జమ్ముకాశ్మీర్లో ఒక లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. 370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్లో జరుగుతున్న పెద్దఎన్నిక ఇదే. 543 స్థానాలకు గానూ ఇంతవరకు మూడు దశల్లో 283 సీట్లకు పోలింగ్ పూర్తయింది. నాలుగోదశతో అది 379కి చేరుతుంది.
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా, పుంగనూరు పరిధిలోని మూడు పోలింగ్ కేంద్రాల టీడీపీ ఏజెంట్లను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. సదుం మండలం బూరుగమందలో 188, 189, 190 కేంద్రాల టీడీపీ ఏజెంట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసినట్టు సమాచారం. పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో, టీడీపీ ఏజెంట్లు రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్రలను అపహరించారు. దీనిపై టీడీపీ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
