1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (10:09 IST)

కమలం పార్టీకి గ్లామర్... బీజేపీలో చేరిన మాధవీలత...

భారతీయ జనతా పార్టీకి కాస్త గ్లామర్ వచ్చింది. టాలీవుడ్ సినీ నటి మాధవీలత కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంది. కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు.

భారతీయ జనతా పార్టీకి కాస్త గ్లామర్ వచ్చింది. టాలీవుడ్ సినీ నటి మాధవీలత కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంది. కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు.
 
నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆమె ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. గడ్కరీ ఆమెను సాదరంగా ఆహ్వానించి బీజేపీ కండువ కప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన నచ్చి ఆ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. 
 
అయితే, నటి మాధవీలత బీజేపీలో చేరటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవలే పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ధర్నా కూడా చేసింది. దీంతో ఆమె జనసేనలో జాయిన్ అవుతారనే వార్తలు వచ్చాయి. అందుకు భిన్నంగా ఈ కళాకారిణి బీజేపీలో చేరటం విశేషం. 
 
ఇకపోతే, నటి మాధవీలతతోపాటు కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ వైకుంఠం, కార్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత అమర్ సింగ్ కూడా ఉన్నారు. ఈ చేరికలతో తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతమైనందనీ, ముఖ్యంగా, కీలక నేతలు పార్టీలో చేరటం శుభపరిణామమని కేంద్రమంత్రి గడ్కారీ అన్నారు. అదేసమయంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని.. పార్టీ అధికారంలోకి రావటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.