1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (18:25 IST)

అమలాపాల్‌పై కేసు..చెల్లదన్న కేరళ పోలీసులు.. ఏమైంది..?

నాయక్ చిత్రంలో చెర్రీ సరసన నటించిన అందాల భామ అమలాపాల్ కొన్ని నెలల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. అమలాపాల్ కేర‌ళ‌లో నివ‌సిస్తూ పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నట్లుగా త‌ప్పుడు చిరునామా డాక్యుమెంట్ చూపి ల‌గ్జ‌రీ కారు కొన్న‌దంటూ ఆమెపై పలు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆమె అరెస్ట్ అవుతుందనే వార్తలు కూడా వినిపించాయి. 
 
అంతేకాకుండా రూ.20 ల‌క్ష‌లు ఎగ్గొట్టి చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన అమ‌లాపాల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడి అప్ప‌ట్లో ఆదేశించారు. ఇదే అంశంపై సెక్షన్ 430 - 468 - 471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేసారు. విచారణను పూర్తి చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివరాలను వెల్లడించారు. 
 
అయితే ఈ సంఘటన జరిగింది పుదుచ్చేరిలో అయితే కేసు ఫైల్ అయింది కేరళలో కాబట్టి ఇది మా ప‌రిధిలోకి రాదంటూ కేర‌ళ పోలీసులు కేసు కొట్టేసిన‌ట్టు తెలుస్తుంది. మొత్తానికి కేరళ పోలీసుల నైజం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.