శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: బుధవారం, 12 జూన్ 2019 (18:39 IST)

వామ్మో... నాకు నారా లోకేష్ ఛాంబరా? వద్దు బాబోయ్ అంటూ ఏపీ మంత్రి

నారా లోకేష్... ఏపీ మాజీ మంత్రి. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఘోర పరాజయం పాలయ్యారు. తండ్రి చంద్రబాబు నాయుడు మెజార్టీ కాస్తాకూస్తో తగ్గినా విజయం సాధించారు కానీ కుమారుడు లోకేష్ మాత్రం పోటీలో నిలవలేకపోయారు. ఇప్పుడు మరోసారి నారా లోకేష్ వార్తల్లోకి వచ్చారు.
 
అదెలాగో చూద్దాం. వైసీపికి చెందిన కొత్త మంత్రులు వరుసబెట్టి మంచి ముహూర్తం చూసుకుంటూ సచివాలయంలో ఆయా ఛాంబర్లలోకి వెళ్తున్నారు కదా. మొత్తం 25 మంత్రులకు అధికారులు ఆయా ఛాంబర్లను కేటాయించారు. దాంతో వారివారి ఛాంబర్లలోకి ప్రవేశిస్తున్నారు మంత్రులు. ఐతే ప్రత్యేకించి ఓ మంత్రి మాత్రం తనకు కేటాయించిన ఛాంబర్ గది 188 చూసి జడుసుకున్నారట. తనకు ఆ ఛాంబర్ వద్దు బాబోయ్ అని చెప్పారట.
 
ఇంతకీ ఆ ఛాంబర్ ఎవరిదయా అంటే... గతంలో అది మాజీ మంత్రి నారా లోకేష్ బాబుది. ఈ ఛాంబర్‌ను ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అధికారులు కేటాయించారట. విషయం తెలుసుకున్న మంత్రిగారు తనకు ఆ ఛాంబర్ వద్దుబాబోయ్ అంటూ చెప్పారట. దాంతో ఆయనకి సచివాలయంలోని 3వ బ్లాక్‌లోని 203 రూమ్‌ను ఛాంబర్‌గా కేటాయిస్తూ ఏర్పాట్లు చేశారట. అదీ సంగతి.