కరోనా వైరస్‌ను కనిపెట్టే మాస్క్.. ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు!

బుధవారం, 21 సెప్టెంబరు 2022 (08:34 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. గత 2019లో వెలుగు చూసిన ఈ వైరస్ ఇపుడు ఓ సీజనల్ మహమ్మారిగా మారిపోయింది. ఈ వైరస్ బారినపడిన బాధితుల్లో లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ పలు దేశాలు ఈ వైరస్ గుప్పిట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను గుర్తించి మాస్క్‌ను కనిపెట్టారు. 
 
మన చుట్టూ ఉండే వాతావరణంలో కరోనా సహా పలు రకాల వైరస్‌ల ఉనికిని గుర్తించి అప్రమత్తం చేసే సరికొత్త వైర్‌లెస్ మాస్కును చైనా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. 
 
దీన్ని అప్టేమర్స్ అనే సింథటిక్ అణువులతో తయారు చేసి, దీనికి ప్రత్యేక బయోసెన్సర్‌ను మాస్కులో వారు పొందుపరిచారు. వాతావరణంలో కరోనా, ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌లను అది కేవలం 10 నిమిషాల్లో నిర్ధారిస్తుంది. ఈ మాస్కును ధరించిన వ్యక్తి ఫోనుకు సంబంధిత సమాచారాన్ని చేరవేస్తుంది. 

అన్నీ చూడండి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

Shivaji: నాగార్జున ఇచ్చిన పారితోషికంతో భూమి కొనుగోలు చేశా : శివాజీ

తర్వాతి కథనం
Show comments