బలపాలు, మట్టి, బియ్యం తింటున్నారంటే... అది వున్నట్లే...

సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (14:39 IST)
మట్టి తినడాన్ని జనం సాధారణంగా తీసుకుంటారు. మరికొందరైతే ఏముందిలే చిన్న పిల్లలు కదా.. కొన్నిరోజులకు వారే మానేస్తారని చాలా ఈజీగా చెపుతుంటారు. ఇలా చేయడం వలన నష్టం ఏమి లేదా అనేది ప్రశ్న. తప్పకుండా నష్టం జరుగుతుంది. ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల్లో ఎందువలన ఈ లక్షణం వస్తుందనే అంశాన్ని పరిశీలిద్దాం. 
 
మట్టి తినడాన్ని మృద్బక్షణ అని అంటారు. ఇది సాధారణంగా రక్త క్షీణత, అజీర్తి, నులి పాములు, ఏలిక పాములు చిన్నపిల్లల కడుపులో ఉన్నపుడు ఈ లక్షణం వస్తుంది. సుద్ధ, మట్టి, నామసుద్ధ, బలపాలు తినాలనిపిస్తుంది. ఇంతటితో ఆగుతుందా అంటే కానే కాదు. ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దాన్ని నిరోధించేందుకు మందులు వాడాలి.
 
కాచిన సింధూరం 50 గ్రా, కాంతలోహ 50 గ్రాములను తేనెతో కలిపి రెండు పూటలా వేయాలి. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇందులో కూడా తీవ్రత ఉంటుంది. ఏలికపాములు, నులి పురుగులు ఉన్నట్లయితే ఒక్క గ్రాము విడంగాది చూర్ణం, 50 గ్రాముల కాసిన సింధూరం తేనేతో కలిపి రెండు పూటలా తినిపించాలి. పండ్ల రసాలు, మామూలు భోజనం, పౌష్టికాహారం ఇవ్వాలి. సరియైన సమయంలో చికిత్స తీసుకోకుండా ఉంటే పాండు రోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం మంచిది.

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments