Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం మెరిసిపోవాలంటే పుదీనాతో ఇలా పట్టు వేయాలి

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 3 జనవరి 2020 (21:46 IST)
మహిళలు తమ అందానికి మెరుగులు దిద్దేందుకు చేసే ప్రయత్నాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను కొంటుంటారు. ఐతే అందుబాటులో వుండే వాటితోనే అందంగా మారవచ్చు. 
 
1. పుదీనా రసంలో ఓట్స్ కొంచెం తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేయాలి. ఈ మాస్క్‌ను ముఖం మొత్తం అప్లై చేయాలి. కొద్ది సేపు మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు పుదీనా జ్యూస్‌ని రోజు ఒక గ్లాస్ తాగితే శరీరానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది. 
 
2. గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్‌ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది. 
 
3. పుదీనా రసంలో కొద్దిగా పెరుగు మరియు తేనె మిక్స్ చేసి ఈ పేస్ట్‌ని  చర్మానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముడుతలు తొలగిపోయి నిగారింపు వస్తుంది. 
 
4. పుదీనా రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్‌సెల్స్‌ను నివారిస్తుంది. అంతేకాక చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది.

అన్నీ చూడండి

బాగా వేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

ఆగష్టు 7, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?

అస్సాంలో పదవ తరగతి విద్యార్థిపై హత్యాచారం.. ఫంక్షన్‌కు వెళ్లిన తల్లి.. మంచంపై విగతజీవిగా..?

పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సర్కారు విఫలం.. వైఎస్ జగన్

ప్రేమ పేరుతో మోసం చేశాడు.. నేను ఏడు నెలల గర్భిణి.. న్యాయం కావాలి (video)

అన్నీ చూడండి

Korean Kanakaraju Review : రొటీన్ ఫార్మెట్ అయినా థ్రిల్ కలిగించే కథగా కొరియన్ కనకరాజు - రివ్యూ

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

హుషార్‌ పిట్టలు సెకండాఫ్‌లో నాలుగు సార్లు ఏడ్చాను : చరణ్‌ అర్జున్‌

అనకాపల్లి మూవీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా: సోనూ సూద్

తర్వాతి కథనం
Show comments