పసుపులో మీగడ కలిపి ప్యాక్ వేసుకుంటే..?

సోమవారం, 7 జనవరి 2019 (12:11 IST)
అధిక ధరలు చెల్లించి ఫేస్‌ఫ్యాక్స్, స్క్రబ్బస్ వాడడం కంటే సహజసిద్ధంగా లభించే పసుపుని వాడడం మంచిదని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. పసుపు వాడకం వలన మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. పసుపుతో ప్యాక్, స్క్రబ్ ఇంట్లోనే తయారుచేసుకుని మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ ప్యాక్ ఎలా చేయాలో.. ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం...
 
2 స్పూన్ల పసుపులో స్పూన్ బియ్యం పిండి, టమోటా రసం, పాలు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ తరువాత ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే ముఖంపై గల మొటిమలు, నల్లటి మచ్చలు పోయి ముఖం కాంతింతంగా, మృదువుగా తయారవుతుంది.
 
3 స్పూన్ల పసుపులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
 
ఒక బౌల్‌లో కొద్దిగా పసుపు వేసుకుని అందులో స్పూన్ మీగడ, శెనగపిండి కలిపి స్క్రబ్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాలపాటు ముఖాన్ని మర్దన చేసి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది. 

అన్నీ చూడండి

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments