Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2016-17‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం.. తెల్లని దుస్తుల్లో ప్రధాని మోడీ

Written By pnr
Updated: సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (10:49 IST)
కేంద్ర వార్షిక బడ్జెట్ 2016-17కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి సోమవారం ఉదయం ఆమోదముద్ర వేసింది. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
 
అంతకుముందు.. ఆయన రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ నుంచి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. అలాగే, అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టనున్న ఆర్థిక బడ్జెట్‌ ప్రతులను అధికారులు పార్లమెంటుకు చేర్చారు. వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోక్‌సభ సభ్యులకు అందజేస్తారు. 
 
మరోవైపు ఈరోజు నాకూ పరీక్షే అని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తెల్లని దుస్తులు ధరించి పార్లమెంటుకు చేరుకున్నారు. 125 కోట్ల మంది ప్రజలు పెట్టే పరీక్షలో విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నానని చెప్పిన ప్రధాని అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలింపజేస్తూ ప్రశాంత వదనంతో పార్లమెంట్‌ భవన్‌కు చేరుకున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Mamitha Baiju: అరుదైన మైలురాయిని అందుకున్న హీరోయిన్ మమితా బైజు

Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

రాజ‌మౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ డేట్ ఫిక్స్

Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత

మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి

Show comments