Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఎందుకంటే?

Written By సిహెచ్
Updated: మంగళవారం, 26 మే 2020 (17:59 IST)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ప్రధాన ఆందోళన ఏమిటంటే, పౌరుల భద్రతకు భరోసా కల్పించేలాగా, లాక్ డౌన్ నిబంధనల సడలింపును ఎలా సమతుల్యం చేయాలనేదే. ఈ మహమ్మారి వ్యాప్తి యొక్క రెండవ దశ గురించిన ఆందోళనలు మరియు ఉద్రిక్తతలు కూడా కొనసాగాయి.
 
బంగారం
గత వారం, యుఎస్ఎ, చైనా మరియు ప్రపంచంలోని ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలలో ఉద్దీపనా ప్రణాళికలు మరియు విధానాలను ప్రకటించబడిన నేపథ్యంలో, బంగారం ధరలు 0.2 శాతం తగ్గాయి. ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో లాక్ డౌన్ నిబంధనలను తొలగించడం వలన, మార్కెట్ మనోభావాలకు మద్దతు లభించింది, ఇది పసుపు లోహం ధరలు తగ్గడానికి దారితీసింది.
 
గ్లోబల్ ఈక్విటీలు మరియు ముడి చమురు ధరల పెరుగుదల పెట్టుబడిదారులలో రిస్క్ తీసుకునే ఆత్రుతను మరింత పెంచింది. యుఎస్ మరియు చైనాల మధ్య గల ఉద్రిక్తతలు మరియు కొత్త మరియు సంభావ్య టీకాను రూపొందించే పరుగుపోటీ,  మార్కెట్ మనోభావాలపై భారం మోపాయి మరియు ధరల తగ్గుదలకు అడ్డుకట్ట వేసాయి.
 
వెండి
గత వారం, స్పాట్ వెండి ధరలు 0.15 శాతం పెరిగి ఔన్సుకు 17.2 డాలర్లకు చేరుకున్నాయి. ఎంసిఎక్స్ ధరలు 1.17 శాతం పెరిగి కిలోకు రూ. 48,257 వద్ద ముగిశాయి.
 
ముడి చమురు
గత వారం, డబ్ల్యుటిఐ ముడిచమురు ధరలు 13 శాతం పెరిగాయి, వివిధ ప్రదేశాలలో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించబడ్డాయి. తగ్గుతున్న డిమాండ్‌ను ఎదుర్కోవటానికి ఒపెక్ మరియు సౌదీ అరేబియా ప్రకటించిన దూకుడు ఉత్పత్తి కోతలు, ధరల పెరుగుదలకు దారితీశాయి. విడుదల నివేదికలు ఒపెక్ ఫలితాల కోతలను మరింత కాలం పొడిగించవచ్చని, ఇది చమురు ధరలను మరింత పెంచుతుందని పేర్కొంది.
 
ఇంకా, ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్, 5 మిలియన్ బారెల్స్ గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య పునరుత్పాదక వాణిజ్య ఉద్రిక్తతలు మరియు వాయు మరియు రహదారి ట్రాఫిక్‌పై పరిమితులు మరింత లాభాలకు అడ్డుకట్ట చేశాయి.
 
మూల లోహాలు
గత వారం, లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్(ఎల్ఎమ్ఇ)లో మూల లోహ ధరలు సానుకూలంగానే ముగిశాయి. పారిశ్రామిక లోహాల డిమాండ్‌ను పెంచే మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచాలనే నిర్ణయంతో చైనా నిర్వహించిన ప్రభుత్వ సమావేశం ముగిసింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పిబిఒసి) మరియు ఇతర కేంద్ర బ్యాంకులు నిర్వహించిన ఉద్దీపన ప్రణాళికలు మార్కెట్ చింతలను తగ్గించాయి మరియు ధరలను పెంచాయి.
 
మైనింగ్‌పై విధించిన మహమ్మారి సంబంధిత నిబంధనల మధ్య ఫిలిప్పీన్స్ 2020 సంవత్సరం మొదటి త్రైమాసంలో నికెల్ ధాతువు ఉత్పత్తిలో 27% తగ్గినట్లు నివేదించింది. అయినప్పటికీ, పెరూ మరియు భారతదేశంలోని జింక్ గనులలో లాక్ డౌన్‌ల కొంత సడలింపు అనేది, అధిక సరఫరా ఆందోళనలను పెంచింది మరియు జింక్ ధరను పరిమితం చేసింది.
 
రాగి
గత వారం, చైనా ఆర్థిక వ్యవస్థ నుండి డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (ఎల్ఎమ్ఇ) రాగి ధరలు 2 శాతం పెరిగాయి. అయినప్పటికీ, యుఎస్ చైనా వైపు వేళ్లు ఎత్తి చూపడం కొనసాగిస్తూ, మాంద్యం లాంటి పరిస్థితులు మరియు మహమ్మారిని వారే సృష్టించారని వారిని నిందించింది. ఈ ఆరోపణలు మార్కెట్ మనోభావాలపై భారం మోపాయి.
 
మహమ్మారి వ్యాప్తి యొక్క రెండవ దశను, ప్రపంచ దేశాలు ఇక ఎలా ఎదుర్కొంటాయో మరియు విస్తృతమైన నిరుద్యోగ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటాయో చూడటమే మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా సాధారణ స్థితికి తిరిగి రావడం అనే అస్పష్టభావాలు కనిపిస్తున్నాయి మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ త్వరలో కోలుకుంటుందని భావిస్తున్నారు.
 
-ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్
 

అన్నీ చూడండి

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments